TDP all set for No-Trust move

News pulse, Politics | admin | June 2, 2011 at 4:29 am

TDP

రైతు సమస్యలపై ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. అయితే అవిశ్వాసం అధికార దాహంతో కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. అడ్డదారిలో అధికారం చేజిక్కించుకోవడానికి ఈ అవిశ్వాసం కాదన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు తర్వాత మీడియాతో మాట్లాడారు.

ప్రజా సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు అన్నారు. రైతుల దగ్గర ధాన్యాన్ని కొనే నాధుడే లేడని.. మద్దతు ధర ఇచ్చి ఆదుకునేందుకు సర్కార్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామెన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అందుకే రైతు సమస్యలపై ప్రభుత్వానికి అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని ప్రకటించారు.

మరోవైపు డిప్యూటీ స్పీకర్‌ను కలిసేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. అయితే స్పీకర్‌ ఎన్నిక కోసం ఈ సమావేశం జరుగుతుందని తెలిసినా.. తమ వంతు ప్రయత్నంగా ఈ నోటీసు ఇస్తున్నారు.

Related posts:

  1. TJAC raps Komati for voting against no-trust move
  2. I dare Nagendar, Mukesh to come out of Hyd
  3. Damodar Raja Narasimha cannot be Dy CM
  4. Jai Telangana in TDP’s Mahanadu
  5. KK’s bheeshana keka
  6. TDP to move no-trust motion
  7. TDP challenges Jagan’s YSR Cong
  8. Nara Lokesh into active politics
  9. 75 lakhs release order issued for Tank Bund statues
  10. Deeksha planned by Jagan

Leave a Reply

Spam protection by WP Captcha-Free